Kalavaibhavam.com(21-Feb): శ్రీశైల మల్లన్నను దర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు

శ్రీశైల మల్లన్నను దర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు

శ్రీశైలమహాక్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట దేవదాయశాఖ మాత్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, సమాచార పౌరసంబంధాలు, రవాణా శాఖ మాత్యులు పేర్ని వెంకట్రామయ్య, ( పేర్నినాని), శ్రీశైల శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డిలు శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల సుప్రభాత దర్శనం చేసుకున్నారు. శుక్రవారం ఉదయం 4 గంటలకు ప్రధానాలయ రాజగోపురం వద్ద దేవదాయశాఖ అదనపు కమీషనర్ మరియు బ్రహ్మోత్సవాల చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ కె.రామచంద్రమోహన్ దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామరావు, అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభ దర్శనం, రత్నగర్భగణపతిని దర్శించుకున్న అనంతరం స్వామివార్ల అలంకార దర్శనాన్ని చేసుకున్నారు. ఆ తరువాత శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచనమండపంలో వేదపండితులు అశీర్వచనాలు చేశారు. కార్యనిర్వహణాధికారి వారు స్వామివార్ల శేషవస్త్రాలు, లడ్డూ ప్రసాదాలను అందజేశారు.

శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న విజయవాడ సెంట్రల్ (కృష్ణ) ఎమ్మెల్యే మల్లాది విష్ణు వర్ధన్.

254 thoughts on “Kalavaibhavam.com(21-Feb): శ్రీశైల మల్లన్నను దర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *