ఆరుగురు కార్టూనిస్టులకు కార్టూన్ వాచ్ జీవిత్త సాఫల్య పురస్కారాలు
హైదరాబాద్ నెక్లెస్రోడ్డులోని ది పార్క్ హోటల్లో శనివారం కార్టూన్ వాచ్ ఎడిటర్ త్రయంబక్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్టూన్ ఫెస్టివల్లో ఆరుగురు కార్టూనిస్టులకు కార్టూన్ వాచ్ జీవిత్త సాఫల్య పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్టూన్ వాచ్ స్పెషల్ ఎడిషన్ను ఆవిష్క రించారు.
కార్టూన్ వాచ్ జీవిత్త సాఫల్య పురస్కారాలు అందుకున్న కార్టూనిస్టులు:
2019 సంవత్సరానికి గానూ దివంగత సీనియర్ కార్టూనిస్టు మోహన్ (ఆయన తరఫున సోదరుడు ప్రకాష్ అవార్డును అందుకున్నారు), సీనియర్ కార్టూనిస్టులు జయదేవ్ బాబు, ఎం.ఎస్.రామకృష్ణలకు పురస్కారాలు అందచేశారు.
ఈ ఏడాది 2020కి నవ తెలంగాణ కార్టూనిస్టు నర్సిం, సాక్షి కార్టూనిస్టు శంకర్, నమస్తే తెలంగాణ కార్టూనిస్టు మృత్యుంజయ్లకు పురస్కారాలు అందచేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎన్ఎండీసీ సిఎండి ఎన్ బైజేంద్రకుమార్, నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్రెడ్డి, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.