మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్న ఒడిస్సి మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు
వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శిల్పారామం మాదాపూర్ లో ఒడిస్సి మరియు కూచిపూడి నృత్యప్రదర్శనలు ఎంతగానో అలరించాయి.
కొలకత్తా నుండి విచ్చేసిన ఒడిస్సి కళాకారుడు జీతగోష్ తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. శివస్తుతి, సావేరి పల్లవి, దుర్గ స్తుతి అంశాలను చక్కని అభినయంతో ప్రదర్శించారు.
శ్రీ మయూరి నృత్యాలయ శ్రీదేవి ఆధ్వర్యంలో వారి శిష్య బృందం కూచిపూడి కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. భజమానస, శివుడు తాండవమాడెను, కొలువైతివారంగ, మరకతామణిమయ, అడిగొల్లదిగో, అష్టలక్షి, ఇదిగోబద్రాద్రి, బాలకనకమయ, వినాయక కాతం మొదలైన అంశాలను ప్రదర్శించి మెప్పించారు.