Kalavaibhavam.com(23.04.19): దర్శనమ్ ఆధ్వర్యంలో రెండో రోజు రసరమ్యంగా కొనసాగిన “సుందరకాండ ప్రవచనాలు” – ముఖ్య అతిధిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఐవైఆర్ కృష్ణారావు
దర్శనమ్ ఆధ్వర్యంలో రెండో రోజు (23.04.19) రసరమ్యంగా కొనసాగిన “సుందరకాండ ప్రవచనాలు” – ముఖ్య అతిధిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఐవైఆర్ కృష్ణారావు
ఈరోజు (23.04.19) రవీంద్రభారతి సమావేశ మందిరంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఆద్వర్యంలో శ్రీమాన్ రామానుజదాస స్వామి వారిచే ” సుందరకాండ ప్రవచనములు ” రెండో రోజు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఐవైఆర్ కృష్ణారావు జ్యోతిప్రకాశనం చేసి ప్రారంభించారు. సుందరకాండ రామాయణంలో కీలక ఘట్టమని, అటువంటి సుందరకాండ ప్రవచనాలు మూడు రోజులు నిర్వహించడం అభినందనీయమని కృష్ణారావు అన్నారు. అనంతరం శ్రీమాన్ రామానుజదాస స్వామిని సత్కరించారు.
కీర్తి శేషులు శ్రీమాన్ వావిలికొలను సుబ్బారావు (వాసుదాస స్వామి) నెలకొల్పిన శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజం (అంగలకుదురు) నిర్వాహకులు శ్రీమాన్ రామానుజదాస స్వామి సుందరకాండ ప్రవచనములు చేసారు.
ముఖ్యమంత్రి ప్రధాన ప్రజాసంబంధాల అధికారి శ్రీ వనం జ్వాలా నరసింహారావు,శ్రీ సీతారామయ్య, దర్శనమ్ సంపాదకులు మరుమాముల వెంకటరమణ శర్మ, ఆధ్యాత్మికవేత్త సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.
బుధవారం (ఏప్రిల్ 24) సుందరకాండ ప్రవచనాలు ఆఖరి రోజు కార్యక్రమానికి కూడా భక్తులు అత్యధిక సంఖ్యలో విచ్చేసి భగవత్ కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.
1 thought on “Kalavaibhavam.com(23.04.19): దర్శనమ్ ఆధ్వర్యంలో రెండో రోజు రసరమ్యంగా కొనసాగిన “సుందరకాండ ప్రవచనాలు” – ముఖ్య అతిధిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఐవైఆర్ కృష్ణారావు”
You can definitely see your enthusiasm in the article you write. The world hopes for more passionate writers like you who aren’t afraid to mention how they believe. All the time go after your heart.
You can definitely see your enthusiasm in the article you write. The world hopes for more passionate writers like you who aren’t afraid to mention how they believe. All the time go after your heart.