దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన మూడు రోజుల “సుందరకాండ ప్రవచనములు”
రవీంద్రభారతి సమావేశ మందిరంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఆద్వర్యంలో శ్రీమాన్ రామానుజదాస స్వామి వారిచే ” సుందరకాండ ప్రవచనములు ” మూడవ రోజు కార్యక్రమాన్ని దూరదర్శన్ పూర్వ సంచాలకులు పాలకుర్తి మధుసూదనరావు ప్రారంభించారు.
కీర్తి శేషులు శ్రీమాన్ వావిలికొలను సుబ్బారావు (వాసుదాస స్వామి) నెలకొల్పిన శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజం (అంగలకుదురు) నిర్వాహకులు శ్రీమాన్ రామానుజదాస స్వామి “సుందరకాండ ప్రవచనములు ” మూడవ రోజు ఘనంగా ముగిసాయి.
సమాపనోత్సవం లో దూరదర్శన్ పూర్వ సంచాలకులు పాలకుర్తి మధుసూదనరావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి, ఢిల్లీలో రాష్ట్ర ప్రతినిధి డా.సముద్రాల వేణుగోపాలాచారి, ఎమ్మెల్సీ రామచందర్ రావు, జెన్ కో సీఎండీ ప్రభాకరరావు, భండారు రామచందర్ రాయ్, ముఖ్యమంత్రి ప్రధాన ప్రజాసంబంధాల అధికారి వనం జ్వాలా నరసింహారావు, ఎస్ బిఐ మాజీ సీజీఎమ్ బండారు రామచందర్ రావు, దర్శనమ్ సంపాదకులు మరుమాముల వెంకటరమణ శర్మ, ఆధ్యాత్మికవేత్త సీతారామయ్య, దైవజ్ఞ శర్మ, భీంసేన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మూడు రోజులుగా సుందరకాండ ప్రవచనములు చేసిన శ్రీమాన్ రామానుజదాస స్వామిని అతిదుల చేతులమీదుగా ఘనంగా సత్కరించారు.
Have you ever thought about creating an e-book or guest authoring on other websites? I have a blog based upon on the same subjects you discuss and would really like to have you share some stories/information. I know my viewers would enjoy your work. If you are even remotely interested, feel free to send me an e mail.