Kalavaibhavam.com(3-Feb): ‘మదిలో వీణలు మ్రోగె’ దాశరథి సినీగీతాల గ్రంథావిష్కరణ చేసిన తెలంగాణా శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

‘మదిలో వీణలు మ్రోగె’ దాశరథి సినీగీతాల గ్రంథావిష్కరణ చేసిన తెలంగాణా శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

దాశరథి తన కవితలు, గేయాల ద్వారా యువతకు స్పూర్తి దాయకమైన వ్యక్తిత్వం వున్నవారని ముఖ్య అతిథి గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మనకు సినారె, దాశరథి గారల పాటలు వింటుంటే ఎంతో అహ్లాదకరంగా ఉంటుందని అన్నారు..

సోమవారం తేదీ 03.02.2020న రవీంద్రభారతిలో వంశీ ఇంటర్ నేషనల్ ఆధ్వర్యంలో, సీల్వెల్ కార్పొరేషన్ శుభాకాంక్షలతో, తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ అభినందనలతో ‘మదిలో వీణలు మ్రోగె’ దాశరథి సినీగీతాలకు సచిత్ర సహృదయ వ్యాఖ్య గ్రంథావిష్కరణ జరిగింది.. శారద ఆకునూరి నాయకత్వంలో ‘మ్రోగింది వీణా” దాశరథి సినీ పాటలతో సినీ సంగీత విభావరి కొనసాగింది.. గాయకులు శ్రీయుతులు బాలకామేశ్వరరావు, రాము, వేణు శ్రీరంగం పాల్గొన్నారు.

కళాబ్రహ్మ, శిరోమణి డా. వంశీ రామరాజు, వ్యవస్థాపకులు, వంశీ సంస్థలు సభా కార్యక్రమాన్ని నిర్వహించారు.. గ్రంథకర్త డా వి.వి. రామారావు, డా. తెన్నేటి సుధా దేవి, గుత్తా సుఖేందర్ రెడ్డి, చైర్మెన్, తెలంగాణా శాసన మండలి, డా. కె.వి. రమణ, ఐ.ఎ.ఎస్ (రి), మండలి బుద్ద ప్రసాద్, వై.వి.ఎస్. చౌదరి, బండారు సుబ్బారావు, చైర్మన్, సీల్వెల్ కార్పొరేషన్ అతిధులుగా పాల్గొన్నారు.

వ్యాఖ్యాతగా శ్రీమతి సుధామయి వ్యవహరించారు.

శారద ఆకునూరి సభా కార్యక్రమాన్నిదిగ్విజయంగా జరిపినందుకు అందరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పారు

277 thoughts on “Kalavaibhavam.com(3-Feb): ‘మదిలో వీణలు మ్రోగె’ దాశరథి సినీగీతాల గ్రంథావిష్కరణ చేసిన తెలంగాణా శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి”

  1. Hello, i feel that i noticed you visited my website so i got here to return the desire?.I am trying to in finding things to improve\r\nmy website!I suppose its adequate to make use of a few of\r\nyour concepts!!\r\n\r\nCheck out my website : ytmp3

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *