దివంగత నేత ఈశ్వరి భాయి వర్ధంతి సందర్భంగా రవీంద్ర భారతి లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తెలంగాణా వాదాన్ని గట్టిగా వినిపించిన మహిళా నాయకులలో ఈశ్వరి భాయి ముఖ్యులు అన్నారు. ఆమె ఉద్యమం లో అలుపెరగకుండా పనిచేసారు అన్నారు. సమాజం లో అట్టడుగు వర్గాల కోసం కీలకం గా పనిచేసారు. అందరికి ఆదర్శ ప్రాయురాలు ఈశ్వరి భాయి అన్నారు .ఆమె పూర్తిగా అంబేద్కర్ వాది అని అయన ఆశయాల కోసం నిరంతరం కృషి చేసారు అన్నారు .సమాజం లో మార్పు కోసం పనిచేసిన గొప్ప వ్యక్తి ఆమె అన్నారు. రాజకీయాలకు అతీతం గా అంబేద్కర్ స్ఫూర్తి తో సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన భారతి, కొండవీటి సత్యవతి,మనీషా బంగారు ,కే.భారతి లను ఈ సందర్భంగా అయన అభినందించారు .ఈ కార్యక్రమం లో అబ్కారి శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎం.ఎల్.సి ప్రభాకర్, డాక్టర్ కే.వి. రమణ చారి, డాక్టర్ గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.