Kalavaibhavam.com(23-Feb): వైస్సార్ మూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా ” వసంతోత్సవాలు ” – ప్రతిభావంతులకు పురస్కారాలు

వైస్సార్ మూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా ” వసంతోత్సవాలు ” – ప్రతిభావంతులకు పురస్కారాలు

ఈ రోజు శ్రీ త్యాగరాయగాన సభలోని కళా సుబ్బారావు కళావేదికలో వైస్సార్ మూర్తి చారిటబుల్ ట్రస్ట్, వైస్ క్లబ్ అఫ్ సికింద్రాబాద్ సెంట్రల్, శ్రీ త్యాగరాయగాన సభ కలసి ” వసంతోత్సవాలు ” శీర్షికన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబరాలు (నృత్యాలు చేద్దాము, పాటలే పాడుకొందాము, కవితలే వినిపిద్దాము) కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా 18నుంచి77 వయస్సు గల పలువురు నృత్యకళకారులు, కవయిత్రులు సంగీతకళాకారులు పాల్గొని వివిధ కళారూపాలును ప్రదర్శించి అలరించారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులు మాట్లాడుతూ… మన కళలను, తెలుగు సంస్కృతిని ప్రోత్సహించాలని, వై.ఎస్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఎన్నో మంచి కార్యక్రమాలను రూపొందించి ఔత్సహిక కళాకారులను ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు.

ఈ కార్యక్రమ రెండవ భాగము 01-03-2020న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము, శ్రీ లక్ష్మినగర్ కాలనీ, సైదాబాద్ లో జరుగునాని వై.ఎస్.ఆర్. మూర్తి తెలిపారు.

ఈ కార్యక్రమానికి విశ్వసాహితి అధ్యక్షుడు డా. బ్రహ్మణపల్లి జయరాములు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. వై.ఎస్.ఆర్. మూర్తి సభాధ్యక్షత వహించారు. భీమన్న సాహితీ నిధి అధ్యక్షురాలు హైమవతి భీమన్న, గాయని వై. కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

256 thoughts on “Kalavaibhavam.com(23-Feb): వైస్సార్ మూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా ” వసంతోత్సవాలు ” – ప్రతిభావంతులకు పురస్కారాలు”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *